1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Prashanth Kishore to meet once again with CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మళ్లీ భేటీకానున్న పీకే

prashanth kishore
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీకానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన పీకే... ఈ నెల 18వ తేదీన మరోమారు తెరాస అధినేతతో సమావేశంకానున్నట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెరాస పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌కు సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. 
 
వీరిద్దరి భేటీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో జరుగనుంది. ఈ భేటీలోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్ర