1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. telangana assembly speaker denies to enter to assembly suspended bjp mlas

బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే.. వారికి అనుమతి లేదు

telangana
స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డితో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.అంతకు ముందే అసెంబ్లీ సెక్రటరీతో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతివ ప తెలిసిందే.
 
హైకోర్టు తీర్పు కాపీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు అందించారు. అసెంబ్లీకి అనుమతిపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. 
 
అయితే ఈ విషయమై ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. ఎమ్మెల్యేలు కూడా  తమ వాదనను స్పీకర్ ముందుంచారు. అయితే తమ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. 
తర్వాతి కథనం
దక్షిణాది మార్కెట్‌ కోసం ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌