తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు శుక్రవారం పర్యటించనున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ముగ్గురు మంత్రులు కలిసి ఒకేసారి జిల్లాకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతను కూడా భారీ స్థాయిలో కల్పించారు.