1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. YSR TP YS Sharmila sensational comments on TRS Minister Niranjan Reddy

ఆ కుక్కకు కవిత ఏమైతరో అడగండి... ఆ మంత్రికి తల్లీ, చెల్లి లేరా?

YS Sharmila
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్. షర్మిలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్మిలను మంగళవారం మరదలుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. ఆ కుక్కకు సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత ఏమైతరో అని అడగండి అంటూ తమ పార్టీ కార్యక్తలకు పిలుపునిచ్చారు. 
 
'చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. వాటి బుద్ధి ఎక్కడికి పోతుంది? సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఆ మంత్రికి భార్యాబిడ్డలు, తల్లీ, చెల్లి లేరా? కవిత (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) ఏమైతరో ఆ కుక్కను మీరే అడగండి' అంటూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిపై షర్మిల విరుచుకుపడ్డారు. 
 
తాను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను ఉద్దేశించి మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమితరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుంది' అని అన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు సాగింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భార్యను గర్భవతి చేసి... మరదలిని లాడ్జీకి తీసుకెళ్లిన బావ... చివరకు...