శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (19:34 IST)

'బాహుబలి'లా ఎగబడి కొంటారనుకున్న మెగాస్టార్, చెర్రీ... ఏమైంది మరి? (video)

ఇటీవల కె.జి.ఎఫ్‌ సినిమాను భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో విడుదల చేసిన ఫరానక్తర్ నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్‌కు తీసుకుంది. మొన్నటి వరకు సైరా టీం చాలా టెన్షన్ పడింది. బడ్జెట్ పెరుగుతోంది కానీ ఇతర భాషల్లో సినిమా ఆడుతుందా లేదా అని వర్రీ అయ్యాడు రాంచరణ్. 
 
బాహుబలి రేంజ్ లోనే సైరా సినిమా తీస్తుండటంతో ఆ సినిమాను ఎగబడి కొంటాయని రాంచరణ్ ఎక్సెప్ట్ చేశాడు. కానీ అలా జరుగలేదు. దీంతో చిరంజీవి, రాంచరణ్‌లు తెగ టెన్షన్ పడిపోయారు. ఇటీవల కెజిఎఫ్‌ సినిమాను విడుదల చేసిన ఫరానక్తర్ అనే నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్‌కు కొనిందట.
 
ఫరానక్తర్ సినిమా సంస్ధ కెజిఎఫ్‌ సినిమాను రిలీజ్ చేసి మంచి లాభాలను సంపాదించుకుంది. బాహుబలి, కెజిఎఫ్‌, 2.ఓ వంటి సినిమాలు ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో బాగా ఆడాయి. భారీ ఖర్చుతో తీస్తున్న సినిమాలకు నార్త్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్‌తో తాజాగా సైరా సినిమాను తీసుకున్నారట. సైరా సినిమా హక్కులు హిందీకి అమ్ముడుపోవడంతో టీం ఊపిరి పీల్చుకుంది.
 
ఈ సినిమాకి భారీగా బడ్జెట్ పెరగడంతో చిరంజీవి బాగా ఇబ్బందిపడ్డారట. మొదట 150 కోట్లతో మొదలుపెట్టారు. అది ఇప్పుడు 200 కోట్లకు చేరింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, హిందీ భాషల్లో తీస్తున్నారు. తెలుగువరకు సమస్య లేదు. కళ్ళు చెదిరే రేంజ్‌లో బిజినెస్ అవుతుంది. హిందీతోనే సమస్య అనుకున్నారు. కానీ ఇప్పుడు అయిన బిజినెస్‌తో ఊపిరిపీల్చుకున్నారట.