1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:29 IST)

పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య హీరోయిన్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" చిత్రం. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటించారు. ఇపుడు ఈ భామ పెళ్లిపీటలెక్కనున్నారు. కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు, సీనియర్ హీరో కార్తీక్ తనయుడైన గౌతం కార్తీక్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
గతంలో గౌతం కార్తీక్, మంజిమా మోహన్‌లు కలిసి 'దేవరాట్టం' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు కదా తోసిపుచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతుందన్న విషయం నిర్ధారణ అయింది. 
 
అయితే, ఇపుడు ఈ ప్రేమ జంట తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.