లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్
Nandamuri Balakrishna, Jayant C. Paranji, Bellamkonda Suresh, Bheem's Cicerolio
నందమూరి బాలకృష్ణ లక్ష్మీ నరసింహా మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త పాట యాడ్ చేశారు.
మందేసినోడు అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్ తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, నందమూరి అభిమానులకు ఏదో ఒక స్పెషల్, సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎలాంటి సర్ ప్రైజ్ అని ఆలోచన వచ్చినప్పుడు.. ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ చేశాం. ఒక సాంగ్ ని షూట్ చేసాంగాని సినిమాలో లేదు. ఆ సాంగ్ ని ఎలాగైనా రి రిలీజ్ లో యాడ్ చేయాలి అని ఆలోచన వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్ లో నెగిటివ్ దొరికింది. కానీ సౌండ్ దొరకలేదు సౌండ్ లేదు. ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, తర్వాత డైరెక్టర్ గారికి, బీమ్స్ కి పంపించాను. వాయిస్, లిరిక్ రాసి రికార్డు చేయాలని చెప్పాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరి అభిమానులు ఈ సినిమాని ఈ సినిమాని మళ్లీ మళ్లీ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ, ఒక డాన్స్ బీట్ నెంబర్ కి ఇలా చేయడం అనేది వెరీ వేర్. నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. రామానాయుడు గారు, దత్తు గారు, అరవింద్ గారి తర్వాత ఇండస్ట్రీలో నాలుగో పిల్లర్ సురేష్ గారు. రీ రిలీజ్ లో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయండి. జై బాలయ్య'అన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ, నా 31 ఏళ్ల సినీ సాహిత్య ప్రయాణంలో అతి విచిత్రమైనటువంటి విన్యాసం చేసిన పాట. ముందు ఈ పాటని చిత్రీకరించారు. ఈ పాట స్థానంలో మరో పాటని చిత్రీకరించారు. అది సినిమాలో పెట్టారు. ముందు చిత్రీకరించిన పాట అలానే ఉండిపోయింది.ఈ తరుణంలో ఈ పాటని ఆడియన్స్ కి చూపించాలని ఆలోచన సురేష్ గారికి వచ్చింది. కేవలం విజువల్ మాత్రమే ఉంది. లిప్పు, డాన్స్ మూమెంట్ మాత్రమే ఉంది. మూమెంట్ ని డీకోడ్ చేసి ట్రాక్ చేయాలి. నేను మొదట ఆ పాట చూడగానే అసాధ్యమనిపించింది. కానీ ఇలాంటి అసాధ్యాన్ని చేస్తే మనం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఒక మధురమైన ఘటనగా నిలిచిపోతుంది అని ఆలోచించి మెల్లమెల్లగా తాళం లయ టెంపో ని డీకోడ్ చేసుకుంటూ వచ్చాను. నేను అలా రాసిన పాటకి ఒక్క అక్షరం కూడా మార్చకుండా ట్యూన్ చేసి అద్భుతంగా పాటని కంపోజ్ చేశాడు బీమ్స్. ఈ పాటని బాలయ్య బాబు అభిమానులు అందరికి అంకితం ఇస్తున్నాం'అన్నారు.