శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 మే 2021 (15:37 IST)

ప్లీజ్... బెడ్, వెంటిలేటర్ కావాలి, నా బ్రదర్ చనిపోతున్నాడని హీరోయిన్ చెప్పిన నిమిషాల్లోనే...

కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో మరణమృదంగం వినిపిస్తోంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మృతులు సంఖ్య వుంటోంది. కరోనావైరస్ ధాటికి దేశంలో ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా బాలీవుడ్ నటి పియా బాజ్‌పాయ్ సోదరుడు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశాడు. తన సోదరుడు కరోనా బారిన పడ్డారనీ, అతడికి బెడ్, వెంటిలేటర్ వెంటనే ఏర్పాటు చేయాలంటూ పియా ఉద్వేగంతో చేతులు జోడించి నమస్కరిస్తూ ట్వీట్ చేశారు. ఆమె అలా ట్వీట్ చేసిన గంటలకే ఆమె సోదరుడు ఎలాంటి సౌకర్యాలు లేక కన్నుమూశాడు.
 
తన కళ్లెదుటే తన సోదరుడు మరణించాడంటూ పియా రోదించింది. దీన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణలో పలు రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా కనీసం 3 వారాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.