మెగాస్టార్ డ్యాన్స్కు ఫిదా... ఆ తర్వాత డ్యాన్సర్ అయ్యాను : సాయి పల్లవి
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రముఖ హీరోయిన్ సాయిపల్లివి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిరంజీవి డ్యాన్స్కు వీరాభిమానినని చెప్పారు. చిన్నపుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయి డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'నేను చిన్నపుడు చిరంజీవి నటించిన "ముఠామేస్త్రి" చిత్రాన్ని పలుమార్లు చూశాను. ఆయన డ్యాన్స్కి ఫిదా అయ్యాను. ఆ తర్వాత డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా డ్యాన్స్పై ఆసక్తితో వివిధ షోలలో పాల్గొంటూ వచ్చాను. ఒక ఈవెంట్లో చిరుతో డ్యాన్స్ చేయడం నాకు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకం అని చెప్పారు.
కాగా, ఇటీవల ఆమె అక్కినేని నాగ చైతన్యతో కలిసి "తండేల్" మూవీలో నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అటు తమిళంలో కూడా శివకార్తికేయన్ "అమరన్" చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలైన ఐదు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు.