శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (14:31 IST)

నష్టాల్లో 'సైరా నరసింహా రెడ్డి' : 18 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి", నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటించారు. హీరో రాంచరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 104 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్‌ను, రూ.140 కోట్ల షేర్‌ను రాబట్టింది. 
 
ఈ 18 రోజుల్లో ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా రూ.32 కోట్లకి పైగా వసూలు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి విశేష ప్రజాధారణ లభించినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా లేవన్నది ఇన్‌సైడ్ టాక్‌గా వుంది. అనేక ఏరిపాయాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ఈ చిత్రం నష్టాలను చవిచూసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంపిణీదారులు పూర్తి నిరాశలో కూరుకునిపోయారు.