శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (15:45 IST)

నెల్లూరు జిల్లాలో ప్రభాస్ మల్టీప్లెక్స్ థియేటర్.. 'సాహో'తో ప్రారంభం

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ సొంత థియేటర్ ప్రారంభంకానుంది. అదీ కూడా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ప్రభాస్ నటించిన "సాహో" చిత్రం కూడా ఇదే రోజు విడుదలకానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతోనే ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌లోనే ప్రదర్శించనున్నారు. 
 
కాగా, వి ఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లోని ఓ థియేటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ ఉంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకి చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో భాగస్వామి అని వార్తలు వినపడుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్స్ ఆగస్టు 30వ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ మల్టీప్లెక్స్ మాల్‌లో మూడు థియేటర్లు ఉన్నాయి. ఇందులో 102.6 అడగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తులో కర్వ్డ్ సిల్వర్ స్క్రీన్ ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది మూడోది కావడం గమనార్హం. ఆసియాలో అతి పెద్ద సిల్వర్ స్క్రీన్ కూడా ఇదే. 
 
ఈ మల్టీప్లెక్స్‌లో 647 సీట్ల కెపాసిటీతో ఓ థియేటర్, 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్‌ను నిర్మించారు. దీని ప్రారంభానికి ఎవరు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణంరాజు లేదా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ మల్టీప్లెక్స్‌లను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం.