1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మార్చి 2025 (17:34 IST)

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

Vijay Devarakonda
బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సినీ సెలెబ్రిటీలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ సెలెబ్రిటీలు, యాంకర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వంటి వారు కూడా పలు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారు.
 
ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్‌కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని పేర్కొంది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్‌కే అని పేర్కొంది. 
 
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరపున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత యేడాదినే ముగిసిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.