సోమవారం, 6 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కస్టమర్లా వచ్చి కారం చల్లింది... 20 చెంపదెబ్బలు కొట్టాడు.. పాతదే అయినా వైరల్
అహ్మదాబాద్లో రాణిప్ ప్రాంతంలో దోపిడి జరిగింది. కస్టమర్లా వచ్చిన మహిళ, యజమాని కళ్లలో కారం పొడి కొట్టి దోచుకోవాలని చూసింది. ఆ వ్యాపారి ఏ మాత్రం బెదరకుండా ఆమెను గట్టిగా ప్రతిఘటించి బయటకు నెట్టేశాడు. కేవలం 13 సెకన్లలో 20 దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీడియో లైక్స్ కోసం నాగుపామును నాలుకపై ఆడించాడు, కాటు వేయడంతో మృతి, వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, సబ్ స్క్రైబర్ల కోసం పలువురు యూ ట్యూబర్స్ ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం చేసి ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హరియాణలోని కర్నాల్ ప్రాంతంలో రాజేంద్ర అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐతే మిన్నాగు తలను నోటికి దగ్గరగా పెట్టుకుని ఆడిస్తుండగా... ఇంకాస్త దగ్గరగా పెట్టుకోమంటూ అతడిని ప్రేరేపించడంతో పామును నోట్లో పెట్టుకున్నాడతను. వీడియో కోసం అతడు కాస్త అజాగ్రత్తగా వుండటంతో పాము అతడి నాలుకపై కాటు వేసింది. దాంతో అతడు అపస్మారకంలోకి వెళ్లిపోయాడు.
రోడ్డుకి అడ్డంగా వైఎస్సార్ విగ్రహాలు, తొలగిస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎటుచూసినా నున్నటి రోడ్లు కనబడుతున్నాయి. ఎలాంటి గతుకులు లేని రోడ్లపై వాహనదారులు హాయిగా వెళ్లిపోతున్నారు. ఐతే కొన్నిచోట్ల పంటికింద రాయిలా ట్రాఫిక్ కష్టాలను పలువురి నాయకుల విగ్రహాలు అడ్డుపడుతున్నాయి. కొన్ని కట్టడాలు కూడా ఇబ్బందులుపెడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు చాలాచోట్ల ప్రతిష్టించారనీ, అవి ట్రాఫిక్ కష్టాలను కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డుకు అడ్డుగా వున్న విగ్రహాలను తొలగిస్తున్నారు. ఐతే పెందుర్తి, విశాఖ, ప్రకాశం వంటి ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలు రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వున్నాయనీ, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రేమ పెళ్లైన ఎనిమిది నెలలకే నర్సును హత్య చేసిన భర్త.. గోనె సంచిలో కుక్కి..
మహబూబ్నగర్ జిల్లాలో, ప్రేమ వివాహం జరిగిన ఎనిమిది నెలలకే ఒక 21 ఏళ్ల నర్సును ఆమె భర్త హత్య చేశాడు. ఆ తర్వాత, అది ఆత్మహత్యగా చిత్రీకరించి ఆమె కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించాడు. నర్సు శ్రీదేవిని హత్య చేసిన అనంతరం, ఆమె భర్త చందు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, గ్రామం వెలుపల ఉన్న ఒక వ్యవసాయ పొలానికి తీసుకువెళ్లి పారవేశాడు.
వైరల్ వీడియో: గోంగూర తింటూ.. క్యాబేజీ నములుతూ.. ఓట్లు అడుగుతున్న మన్సూర్ అలీ ఖాన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరుగనున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ విభిన్నమైన పద్ధతిలో ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేయాలని అడుగుతున్నారు. తిరుచిరాపల్లిలోని లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్సూర్ అలీఖాన్ కూరగాయల మార్కెట్లో ప్రజల వద్దకు వెళ్లారు. అక్కడ గోంగూర కట్టను తీసుకుని అందులో ఆకులను పీక్కుని తింటూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించాడు. ఆ తర్వాత అరటిదొప్పను నమిలేశాడు. క్యాబేజీ తీసుకుని కత్తితో ముక్కలు చేసి పచ్చి క్యాబేజీనే నమిలేశాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.