1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (17:48 IST)

రమ్యకు ఏమైంది..? కాలికి అరుదైన వ్యాధి సోకిందట..?

సినీ నటి, కాంగ్రెస్ నేత రమ్యకు ఏమైంది.. అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. రమ్య కాలుకి అరుదైన వ్యాధి సోకడంతో తాను సినీ నటుడు అంబరీష్ అంకుల్ అంత్యక్రియలకు రాలేకపోయానని రమ్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె కాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతోందని.. అందుకే అంబరీష్ అంతిమ వీడ్కోలుకు రాలేదని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కూడా తెలిపారు. 
 
రమ్యా కూడా తాను ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. కాలులోని మూలగకు సంబంధించిన ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఆమె అక్టోబర్ నుంచి విశ్రాంతిలో వున్నారు. ఈ విషయాన్ని రమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు శస్త్ర చికిత్స అయిన ఫోటోను కూడా పోస్టు చేశారు. 
 
కాగా కన్నడ ప్రముఖ నటుడు అంబరీష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో.. ఆయన అంతిమ వీడ్కోలుకు రమ్య హాజరుకాలేదు. దీంతో ఆమె గైర్హాజరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంబరీష్ అభిమానులు రమ్యను నెట్టింట ట్రోల్ చేశారు. నెట్టింట విమర్శల నేపథ్యంలో రమ్య కాలికి శస్త్ర చికిత్స జరిగిందని చెప్పే ఫోటోను షేర్ చేసింది.