1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (10:00 IST)

చెన్నై భర్తలూ జాగ్రత్త.. అన్నం వండలేదా? గరిటెతో భర్తపై భార్య దాడి...

చెన్నైలో భర్తపై చేజేసుకున్న భార్య స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే.. చెన్నై ఐనావరం ప్రాంతానికి చెందిన పొన్నువేల్ పురంలో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.. కార్తీక్ అనే వ్యక్తి. ఇతని భార్యపేరు ధనలక్ష్మి. ఈమె పిన్ని ఇల్లు పక్కనే వుండటంతో ధనలక్ష్మి ఆమె ఇంటికి అప్పుడప్పుడు వెళ్లడం పరిపాటి. దీంతో ఇంట్లో సమయానికి ధనలక్ష్మి వంట చేయకుండా గడిపింది. 
 
ఈ వ్యవహారంపై ధనలక్ష్మిని కార్తీక్ మందలించాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ఆకలితో ఇంటికొచ్చిన కార్తీక్.. అన్నం వండలేదా..? అని భార్యను అడిగాడు. ఆకలితో వచ్చానని భోంచేద్దామనుకుంటే.. ఇంట్లో అన్నం కరువైందని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధనలక్ష్మి తన పిన్నిని ఇంటికి రప్పించి భర్తపై గరిటెతో దాడి చేసింది. 
 
ఈ దాడిలో కార్తీక్‌ తలకు గాయం తగిలింది. ప్రస్తుతం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే... ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో భర్తలు జాగ్రత్త.. పెళ్లాన్ని అన్నం వండలేదా అని అడిగారంటే.. గరిటెతో దెబ్బలు తప్పవంటూ సెటైర్లు పేల్చుతున్నారు.