1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. IIIT Basar Student Dies By Suicide In Hostel Room, Probe Underway

తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

suicide
తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్. ఈ విద్యా సంవత్సరంలోనే బాసర ట్రిపుల్ ఐటీలో చేరాడు.
 
ప్రవీణ్ కుమార్ హాస్టల్ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని, ఇవాళ ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ తీసుకున్నాడని వైస్ ఛాన్సలర్ తెలిపారు.
 
తన గదిలో కాకుండా మరో గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణలో 'పొలిటికల్ బాహుబలి' రిలీజ్: 45 రోజుల్లో రూ. 709 కోట్లు వర్షం