Last Modified: శనివారం, 14 ఫిబ్రవరి 2015 (07:18 IST)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 36,169 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి15గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.