గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం
ఇటీవలి కాలంలో ఎయిరిండియా విమానాలు ప్రమాదాలకు గురికావడం లేదా తరచుగా సాంకేతి సమస్యలు తలెత్తడం జరుగుతోంది. తాజాగా ఓ ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఆ విమానంలో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా దుబాయ్కు మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిరిండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఏఐ-154 విమానం వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యంగా విమానాన్ని సమీపంలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ సురక్షితంగా కిందకు దించారు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ, సాంకేతిక సమస్య తలెత్తినట్టు అనుమానం రావడంతో విమానాన్ని దుబాయ్కు మళ్లించాం. అక్కడ విమానానికి అవసరమైన అన్ని తనిఖీలు పూర్తి చేశాం. ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు తెలిజయేసి వారికి అల్పాహారం అందించారు. తనిఖీల అనంతరం విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.45 గంటలకు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది అని వివరించారు.