శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (23:52 IST)

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

encounter
పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో పోలీసులు, ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న ఒక టెర్రర్ మాడ్యూల్‌తో వీరికి లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ఆపరేషన్‌లో పోలీసులు కీలక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చైనా తయారీకి చెందిన రెండు గ్రనేడ్లు వారి నుంచి లభించాయి. సరిహద్దుల మీదుగా ఐదు అధునాతన తుపాకులు, వాటికి సంబంధించిన లైవ్ బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను బట్టి, వీరు పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
 
ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఈ ఇద్దరు వ్యక్తులకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఒక ఉగ్రవాద ముఠాతో సంబంధం ఉంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వారిని విచారిస్తుండగా.. ఈ వ్యక్తుల గురించి సమాచారం లభించిందని తెలుస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు ప్రతిఘటించి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది.