ఓటీటీలో మై డియర్ భూతం
My Dear Bootham
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసారు. ఈ సినిమా ఓటిటి రైట్స్ని జీ 5 వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 2 నుంచి జీ5 ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో ప్రభుదేవా జీనీగా నటించారు. ఆ గెటప్ పెద్దలతో పాటు పిల్లల్ని ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఆయన నటించిన చిత్రాలకు భిన్నమైన చిత్రమిది.
ఫాంటసీ కథతో రూపొందిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో అదే రోజు విడుదల అయ్యింది. ఈ రోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.
