సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల పరిస్థితి ఏమిటి? ఆర్.ఆర్.ఆర్.పైనా ప్రభావం!
- థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్లే అధికం... : హీరో నాని
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ పూర్తి చేయాలి
- ప్రజల బాగోగులు తెలుసుకుంటూ... పల్లెబాట పట్టిన సోమిరెడ్డి
- ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి
కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం బోర్లాపడ్డారు. కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. వీటిని సబాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కబడ్డీ అవతారమెత్తాడు.
ఒక జట్టు తరపున కూతకు వెళ్లారు. ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపతప్పి కాలు జారి బోర్లాపడ్డారు. ఆ వెంటనే సందర్శకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
