గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 27 జులై 2019 (22:26 IST)

చంద్రబాబు ఎగిరెగిరి ఆడితే అది కూడా మిగలదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార టిడిపిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబును నానా మాటలంటున్నారు. తాజాగా ఈరోజు అసెంబ్లీలో మంత్రి సురేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
చంద్రబాబునాయుడు ఎందుకో ఎగిరెగిరి ఆడుతున్నారు. ఇప్పుడు 23 సీట్లు మాత్రమే టిడిపికి మిగిలింది. ఇంకా ఎగిరెగిరి ఆడితే ఆ సీట్లు ఉండవు. 2024 సంవత్సరానికి ప్రజలు చంద్రబాబును పూర్తిగా ఇంటికి పంపేయడం ఖాయం. ఇప్పటికైనా టిడిపి నాయకులు సైలెంట్‌గా ఉండడం నేర్చుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
 
ఇప్పటికే ముగ్గురు టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వైసిపి నేతలు సస్సెన్షన్ చేయించారు. దీంతో టిడిపి తరపున చంద్రబాబునాయుడు తప్ప మాట్లాడేవారు ఇంకెవరూ లేకుండా పోయారు. దీంతో మంత్రి సురేష్ వ్యాఖ్యలను ఖండించేవారే కరువయ్యారు. కానీ రాష్ట్రంలోని టిడిపి నేతలు మాత్రం సురేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.