శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:20 IST)

చంద్రబాబూ... ఇవిగో కోడెల ఫ్యామిలీ దందాల చిట్టా : టీడీపీ నేత నర్సిరెడ్డి

తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొడెల మరణం గురించి మీడియాలో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి కొన్ని సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితిని పక్కనపెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా దారుణం అనిపించింది అని నర్సిరెడ్డి అన్నారు. 
 
కోడెలా మరణం వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు వాళ్ల యొక్క ఆస్తి పంపకాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన్నా ఆస్తి విషయంలో కొడుకు కుమార్తె మధ్య గొడవలు గురించి పల్నాడు ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు.

పల్నాడు ప్రాంతంలో కోడెల బాధితులు వేళ్ళల్లో ఉన్నారని అందులో మా బంధువులు కూడా ఉన్నారని కోడెలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతమైన అవినీతికి పాల్పడింది నిజం కాదా అని నర్సిరెడ్డి అన్నారు. అలానే  భూములను అక్రమించటం వారికి నచ్చిన రైతుల భూములను అన్యాయంగా అక్రమంగా అక్రమించుకోవటం కోకొల్లలు అని నర్సిరెడ్డి అన్నారు.
 
1. కొండమోడు శ్రీకాళహస్తి రైల్వే పనులు చెయ్యకుండా కాంట్రాక్టర్‌ను బెదిరించి కమిషన్ ఇవ్వలేదు అని కాంట్రాక్టర్‌పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కమిషన్ తీసుకోవటంలో కోడెల శివరాం ముఖ్య పాత్ర వహించాడు అని అలానే వర్కర్స్ షెడ్‌లను కూడా తగల పెట్టించాడు అని నర్సిరెడ్డి తెలిపారు.
 
2. ధూళిపాళ్ల గ్రామంలో 18 ఎకరాల రైతుల భూమిని ఆక్రమించి దానిలో ఉన్న కోళ్ల ఫారాలను తగలబెట్టి అక్కడి రైతులపై దాడి చేసి వారిని తరిమి కొట్టి అక్కడ ఉన్న 18 ఎకరాల్లను అక్రమించిన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాదా అని నర్సిరెడ్డి అన్నారు.
 
3. రాజుపాలెం గ్రామంలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగస్తుల ఐదెకరాల్లో ఉన్న నిమ్మతోటని ప్రోక్లైన్‌తో పీకించి శివరాం మనుషులు ఆ పొలాన్ని అక్రమించుకున్నది నిజం కాదా అని నర్సిరెడ్డి ప్రశ్నించారు. 
 
4. సత్తెనపల్లి మండలనికి సమీపంలో కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ మందుల కంపెనీకి సంబంధించిన మందులను మెడికల్ షాప్‌ల వాళ్ళను బెదిరించి టార్గెట్స్ పెట్టి మందులను అమ్మించి ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు తీశారు అని నర్సిరెడ్డి అన్నారు.
 
5. సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో సంవత్సరానికి ఒక్కో బ్రాందీ షాప్‌కు పాతిక లక్షల నుంచి 50 లక్షల వరకు 5 సంవత్సరాలు కోడెల శివరాం వసూలు చేయడం జరిగిందని నర్సిరెడ్డి అన్నారు.
 
6. సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో స్వీట్స్ షాప్ నుంచి గోల్డ్ షాప్ దాకా డైలీ మామూళ్లు వసూలు చేశారని నర్సిరెడ్డి ఆరోపించారు. 
 
7. అన్నా క్యాంటీన్‌లో ఐదు రూపాయలకు వచ్చే భోజనాన్ని తన సేపు కంపెనీలో పనిచేసే తన వర్కర్స్‌కు 50 రూపాయలకు అమ్మినట్లు నర్సి రెడ్డి తెలిపారు.
 
8. కోడల శివ‌రాంకు సంబంధించిన మోటార్ బైక్ షో రూమ్స్‌లో ప్రభుత్వానికి లైఫ్ టాక్స్ కట్టకుండా బైకులు అమ్ముకున్నారని ఆ విషయంలోనే శివరాంకు సంబంధించిన బైక్ షోరూంలను సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమేగా అని ఆయన తెలిపారు.

9. రెండు నియోజకవర్గాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్స్ దగ్గర అన్ని పనులకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా పది శాతం కమిషన్ తీసుకోవడం నిజం కాదా అని ఆయన నర్సిరెడ్డి తెలిపారు.
 
10. రెండు నియోజకవర్గాలలో అపార్ట్‌మెంట్స్ కట్టాలన్న ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్న వారిని బెదిరించి వాటలు తీసుకున్నది నిజం కాదా అని నర్సి రెడ్డి తెలిపారు.
 
11. రెండు నియోజకవర్గాల గుండా వెళుతున్న ఇసుక లారీలను అడ్డగించి ఇసుకను ఆన్‌లోడ్ చేపించుకోవటం నిజం కాదా అని నర్సిరెడ్డి అన్నారు. ఇన్ని అరాచకాలు చేసిన కుంటుంబన్నీ పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటలు అసత్య ప్రచారం అయన యొక్క శవ రాజకీయాలు చేయడం చూసి మనసు నొచ్చుకుని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయటం నావల్ల కాదు అని నిర్ణయం తీసుకొని  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నపురెడ్డి నర్సిరెడ్డి చెప్పుకొచ్చారు.