1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. health and ayurvedic tips with curd

గంజిలో శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే?

పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400

curd
పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400 గ్రాముల పెరుగు, నువ్వుల నూనెలో కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో పెరుగు తడి ఆరిపోయిన తరువాత నూనెను మాత్రం మరిగించుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడగట్టి నొప్పులు ఉన్న చోటు మర్దన చేసుకుని ఉప్పు కాపడం పెట్టుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వలన కాళ్లకి మంచి పటుత్వం వస్తుంది.  
 
కరక్కాయల్లోని గింజలను తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తగ్గించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాస్ గంజిలో కొద్దిగా శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?