1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (12:52 IST)

టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

students
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర  విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విజయఢంకా మోగించారు. 
 
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన గురుకుల పాఠశాల విద్యార్థులు, గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో కూడా అత్యధికగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉత్తీర్ణతా శాతం 75.68 శాతంగా ఉంది. 
 
మరోవైపు, ఆగస్టు ఒకటో తేదీ నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్  సిప్లమెటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయొచ్చని వివరించారు. 
 
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను పరిశీలిస్తే, 
ఆగ‌స్టు ఒకటో తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు రెండో తేదీన సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు మూడో తేదీన థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు నాలుగో తేదీన మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు ఐదో తేదీన జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు ఆరో తేదీన సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు ఎనిమిదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు పదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2