సంబంధిత వార్తలు
- మళ్లీ వెనకడుగు వేసిన జగన్ సర్కారు : జీవో నంబరు 2 రద్దు
- మీరూ ఒక నిర్మాతే... మీరు ముందుంటే మేము వెనకుంటాం.. సి.కళ్యాణ్
- ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు 6,970
- ఏపీ మంత్రి పేర్ని నానికి వర్మ ప్రశ్నలు.. అలా చేస్తే మీకు ఓట్లు.. మాకు నోట్లు!
- హస్తినలో సీఎం జగన్ బిజీబిజీ... కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - కొత్తగా 334
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 334 కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క రోగి మృత్యువాతపడ్డారు.
మంగళవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శాఖ వెల్లడించిన బులిటెన్ మేరకు... కొత్తగా నమోదైన 334 పాజిటివ్ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,942కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 14,499కు పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1516 యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా ఆయా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 95మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 20,61,927కు చేరుకుంది.
