బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (12:21 IST)

నిర్మల్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకున్న ఆంబులెన్స్ డ్రైవర్‌కి ఛాతిలో నొప్పి..?

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తెలంగాణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌లో 108 ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 42 సంవత్సరాల విఠల్ అనే వ్యక్తి 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు కరోనా టీకా తీసుకున్నారు. 
 
అయితే, 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (20వ తేదీ) 2.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. కానీ అతడు అప్పటికే చనిపోయినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
 
అయితే, కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది. గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. జిల్లా ఏఈఎఫ్ఐ కమిటీ పరీక్షించనుంది.