బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (09:51 IST)

సీతారాం ఏచూరి ఇంట విషాదం.. కరోనాతో కుమారుడు మృతి!

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు సీనియర్ రాజకీయ నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 34 యేళ్లు. ఈయన న్యూఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్‌ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
 
రెండు వారాల క్రితం కరోనా బారినపడిన ఆశిష్.. గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.
 
"నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలిపుతున్నాను" సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.