సంబంధిత వార్తలు
- దేశంలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు
- మొక్క పెరిగేవరకు శ్రద్ద తీసుకోవాలి - సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
- దేశంలో విజృంభిస్తోన్న కరోనా : 24 గంటల్లో 12249 కొత్త కేసులు
- వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించండి.. మాజీ మంత్రి సోమిరెడ్డి
- అగ్నిపథ్పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం
దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసులు భారీగా పెరిగి.. 17 వేలకు పైగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు నాలుగు శాతం దాటి, ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఫిబ్రవరి నెల నాటి ఉద్ధృతి కనిపిస్తోంది.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గురువారం 4 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 17,336 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర పెరిగి, 30 శాతం అధికంగా నమోదయ్యాయి.
ఒక్క మహారాష్ట్ర, కేరళలోనే 9 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. దిల్లీలో ముందురోజు కంటే రెట్టింపు కేసులు రాగా, ముంబయిలో 50 శాతం అధికంగా నమోదయ్యాయి. 2020 ప్రారంభం నుంచి 4.33 కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. అందులో 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు.
తర్వాతి కథనం
