సంబంధిత వార్తలు
- భారత్ కథ కంచికేనా? ఇంకా ఏమైనా ఛాన్సుందా?
- 111 రన్స్ టార్గెట్ను ఉఫ్ అంటూ ఊదేసిన కివీస్ ఆటగాళ్లు... భారత్కు చిత్తు
- కరోనా థర్డ్ వేవ్ భారత్ తలుపు తట్టిందా? పరిస్థితి ఏంటి?
- 15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు
- ఐసీసీ టీ20 : భారత్ చెత్త బ్యాటింగ్ : కివీస్ ముందు స్వల్ప విజయలక్ష్యం!
దేశంలో కొత్తగా మరో 12514 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 12514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్ ప్రభావంతో మొత్తం 4,58,437 మంది మృతి చెందారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
