గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (18:27 IST)

తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ.. సచిన్ బాటలో అర్జున్

Arjun Tendulkar
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 16ఫోర్లు, 2 సిక్సులు వున్నాయి. 
 
మాస్టర్ సచిన్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనతను 15ఏళ్ల వయస్సుల్లో సచిన్ సెంచరీ సాధించగా.. అర్జున్ 23 ఏళ్ల వయస్సులో సాధించాడు. 
 
అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే వంద పరుగులు సాధించి.. గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి.