1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (18:35 IST)

బంగ్లాదేశ్ టూర్: 20న టీమిండియా జట్టు ఎంపిక..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు ప్రయాణమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో పాల్గొనే టీమిండియాను ఈ నెల 20న ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాల తెలిపాయి. 20న జరిగే బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ ముంబయిలోని క్రికెట్ సెంటర్‌లో సమావేశం కానుంది. 
 
బంగ్లా టూర్‌లో భారత జట్టు ఒక టెస్టు, 3 వన్డేలు ఆడుతుంది. వీలైతే ఓ టి20 ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా, టెస్టు క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంటు ప్రకటించిన నేపథ్యంలో, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. 
 
ఇదిలా ఉంటే కోహ్లీతో పాటు మరికొందరు సీనియర్లు ఈ టూర్‌కు వెళ్లలేమని, విశ్రాంతి కావాలని బోర్డును కోరినట్టు సమాచారం. ఇక, దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో మార్పులు చేర్పులపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఈ నెల 19న సమావేశం కానుంది.