సంబంధిత వార్తలు
- Jasprit Bumrah: వెస్టిండీస్తో రెండో టెస్ట్.. మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడిన బుమ్రా
- బీబీఎల్: సిడ్నీ థండర్ తరపున ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్
- ఆసియా కప్: ఏ జట్టునైనా ఓడించగలం.. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ధీమా
- Ravichandran Ashwin: ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్
- సన్ రైజర్స్ హైదరాబాద్కు కొత్త బౌలింగ్ కోచ్
తెలుగు తేజం శ్రీ చరణిపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు
Ashwin
9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ఫైనల్తో సహా సెమీఫైనల్లో శ్రీ చరణి కట్టడిగా బౌలింగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచకప్ ఆడిన తొలి క్రికెటర్ గుర్తింపు పొందిన శ్రీచరణి.. పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్తో పాటు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది.
ఈ రెండు మ్యాచ్ల్లో ఆసీస్పై ఆమె 5 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ.. భారత జట్టులో శ్రీ చరణి ప్రమాదకరమైన బౌలర్ అని పేర్కొంది.
తాజాగా ఈ విజయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. శ్రీ చరణిని ప్రత్యేకంగా కొనియాడాడు. భవిష్యత్తులో ఆమె సూపర్ స్టార్ అవుతుందని జోస్యం చెప్పాడు. ఆమె బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడాడు.
మహిళల క్రికెట్లో గొప్ప స్పిన్నర్లు అయిన సోఫీ ఎక్లెస్టోన్, జెస్ జోనాసెలతో శ్రీచరణిని పోల్చాడు. 'శ్రీ చరణి బంతి తిప్పే విధానం, వేగం అద్భుతమని కొనియాడాడు.
భారత్ సాధించిన అన్ని ప్రపంచకప్ల కంటే ఈ విజయం ఎంతో గొప్పదని కొనియాడాడు. ముఖ్యంగా ప్రపంచకప్ టైటిల్ను మాజీ క్రికెటర్లు అయిన మిథాలీ రాజ్, జులాన్ గోస్వామికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు.
