1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (20:50 IST)

టీమిండియాలో మరో ఇద్దరికి కరోనా: భరత్, శ్రీధర్‌లకు కూడా..?

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని వెల్లడి అయ్యింది. ఈ ముగ్గురు చివరి టెస్టుకు వేదికైన మాంచెస్టర్‌కు వెళ్లబోవడంలేదని మేనేజ్‌మెంట్ వర్గాలు తెలిపాయి. వారు లండన్‌లోనే మరో 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. 
 
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభం కానుంది. రవిశాస్త్రికి ఆదివారం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం వచ్చింది. ఆందులోనూ రవిశాస్త్రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.