1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 మార్చి 2016 (09:38 IST)

మళ్లీ ఒకటి కానున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ: రహస్యంగా..?

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ కలవనున్నారా... ప్యాచప్..?

ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ ఒకటి కాబోతున్నారని తెలిసింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని సమాచారం. ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్న ఈ ఇద్దరూ త్వరలోనే రహస్యంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట. 
 
దీంతో తాను నటిస్తున్న ''సుల్తాన్'' సినిమా షూటింగ్‌కు అనుష్క మూడు రోజుల విరామం ఇచ్చి మరీ కోహ్లీని కలిసి అతనితో విభేదాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. స్వదేశంలో టీ-20 ప్రపంచకప్‌ మొదలైన నేపథ్యంలో ఈ ప్రేమపక్షుల ప్యాచప్‌ చర్చనీయాంశమైంది. 
 
ఇకపోతే.. మహిళా దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యేక సందేశం పోస్ట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే దేశంలో అత్యాచారాలు, చిన్నారులపై వివక్ష ఎక్కువైన నేపథ్యంలో మహిళలపై తన గౌరవాన్ని చాటుకున్నాడు. సమాజంలో సగటు మహిళకు ఎదురవుతున్న ఇబ్బందులపై క్షమించండని కోరుకున్నాడు.