సంబంధిత వార్తలు
- ఈడెన్ గార్డెన్స్లో రెండో సెమీ ఫైనల్ : వర్షంతో ఆగిన ఆసీస్ - సౌతాఫ్రికా మ్యాచ్
- రెండో సెమీ ఫైనల్ : సౌతాఫ్రికా బ్యాటింగ్.. 2 వికెట్లు డౌన్
- ఐసీసీ ర్యాంకులు...: నంబర్ వన్ బౌలర్ ఎవరంటే....
- ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నాలుగో జట్టుగా అర్హత సాధించిన కివీస్.. భారత్తో పోరు...
- వన్డే ప్రపంచ కప్ సెమీస్కు చేరాలంటే పాకిస్థాన్ ఏం జరగాలో తెలుసా?
ఆడుతూ పాడుతూ ఆసీస్ వచ్చేసింది ఫైనల్కి, భారత్తో 19న ఢీ
బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా జట్టు ముందు భారీ లక్ష్యాన్ని వుంచాలని చతికిలపడింది దక్షిణాఫ్రికా. ఆదిలోనే టపటపా వికెట్లను పారేసుకుని 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు ఆడుతూపాడుతూ బాదేసారు. మరో 16 బంతులు మిగిలి వుండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం నాడు నవంబర్ 19న టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుంది.
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్-డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడారు. ట్రవిస్ 62 పరుగులు, డేవిడ్ వార్నర్ 29 పరుగులు చేసారు. ఆరంభంలో గట్టి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చినవారికి లక్ష్య ఛేదన చాలా తేలికగా మారింది. మార్ష్ డకౌట్ అయ్యాడు. స్మిత్ 30, మార్నస్ 18, మాక్స్వెల్ 1, జోష్ 28, మిచెల్ స్టార్క్ 16 నాటౌట్, పాట్ కమిన్స్ 14 నాటౌట్గా నిలిచారు.
