చాంపియన్స్ లీగ్ 20 : కోల్కతా నైట్ రైడర్స్ ఫోర్త్ విన్!
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్), మనీష్ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్)తో చెలరేగి ఆడటంతో కోల్కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
తొలుత కోల్కాతా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత 188 పరుగుల లక్ష్య ఛేదనలో డాల్ఫిన్స్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. సునీల్ నరైన్ (3/33), యూసుఫ్ పఠాన్ (2/25) డాల్ఫిన్స్ పతనాన్ని శాసించారు. డాల్ఫిన్స్ నాలుగు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఊతప్ప ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇక అక్టోబర్ 2న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న తొలి సెమీస్లో హోబర్ట్ హరికేన్స్తో కోల్కాతా తలపడనుంది.