శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (12:39 IST)

భోజనం వడ్డించని భార్య.. తల నరికి హత్య.. ఆపై చర్యం ఒలిచి.. శరీరాన్ని ముక్కలు చేసి...

murder
కర్నాటక రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. భోజనం వడ్డించలేదన్న అక్కసుతో ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యన హత్య చేశాడు. ఆ తర్వాత చర్మాన్ని ఒలిచి శరీరాన్ని ముక్కలు చేసి నరికి దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రంలోని తుమకురూ జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండే వారు. కాగా, సోమవారం రాత్రి కూడా వారు శివరామ ఉద్యోగం విషయమై గొడవపడ్డారు. ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తి ఆమె తల నరికేశాడు. 
 
ఆ తర్వాత ఆమె చర్మం మొత్తం రాత్రంతా ఒలిచాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. మరునాడు ఉదయం తను పని చేస్తున్న సంస్థ యజమానులకు సమాచారం అందించాడు. ఘటన జరిగిన సమయంలో వారి కుమారుడు నిద్రిస్తున్నాడు. 
 
కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పాడు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు.