శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (12:25 IST)

వర్షాకాలం: డెంగ్యూ జ్వరానికి దివ్యౌషధం బొప్పాయి ఆకులు

వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం వ్యాపిస్తోంది. వర్షాకాలంలో జ్వరానికి బొప్పాయి ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. తేనెతో బొప్పాయి ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటే డెంగ్యూ పరారవుతుంది. అంతేగాకుండా 12 గంటల్లోపు ప్లేట్‌లైట్స్ సంఖ్య పెరిగిపోతోంది. 
 
బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఫ్లేవనాయిడ్స్‌, అల్కాలాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది.
 
ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. రోగనిరోధక శక్తికి ఇవి బాగా తోడ్పడతాయి. రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్‌ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. 
 
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్‌ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తుంది. వీటిని భోజనానికి భోజనానికి మధ్య సలాడ్స్‌గానూ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.