శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (15:42 IST)

పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకని అమితంగా తినడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎక్కువైతే మన శరీరానికి అదే విషమవుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఇతర ఆహారాలు తీసుకుంటే కలిగే నష్టాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. కొందరైతే పరగడుపున పుల్లటి ఆహారాలు తీసుకుంటారు. ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తీసుకున్న తరువాతే పుల్లటి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
2. పరగడుపున పండ్లు తినడం మంచిదని ఇటీవలే చాలామంది జోరుగు ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదని.. వెల్లడించారు నిపుణులు. ముఖ్యంగా అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు. అరటిపండులో మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి ఉదయాన్నే ఎక్కువ మోతాదులో మెగ్నిషియం అందడం మంచిది కాదు.
 
3. పరగడుపున శీతల పానీయాలు తాగడం వలన జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలైయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆమ్లం కారణంగా వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారు. కనుక.. ఖాళీ కడుపుతో ఏ పదార్థాన్నైనా తినేముందు కాస్త జాగ్రత్త వహించండి.
 
4. పరగడుపున కాఫీ, టీ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే.. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయని వారు చెప్తున్నారు. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని మాత్రం ఉదయాన్నే తీసుకోండి. ఆ తర్వాత మిగిలినవి.