సంబంధిత వార్తలు
- "అమితాబ్ ఓ యోధుడు"... మీరు త్వరగా కోలుకోవాలి : చిరంజీవి - నాగార్జున
- బాలీవుడ్ నటి రేఖ ఇంటికి సీలు వేసిన ముంబై మున్సిపల్ అధికారు.. కారణం?
- బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు కరోనా ఎలా సోకింది? ఇపుడు ఎలా వుంది?
- నాకు కరోనావైరస్ పాజిటివ్, నానావతి ఆసుపత్రిలో చేరా: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్
- లాక్డౌన్ ఎఫెక్టు : నష్టాల ఊబిలో హైదరాబాద్ మెట్రో
రెమిడీసివిర్ మందు వినియోగంలో హెచ్చరికలు చేసిన ఐసీఎంఆర్
కరోనా వైరస్ బారినపడిన వారికి చికిత్స చేసే విషయంలో రెమిడీసివిర్ను వాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కేవలం ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న వారికి మాత్రమే ఈ డ్రగ్ను ఇవ్వాలని సూచించింది.
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భారత్లో లక్షకు పైగా కొత్త కేసులు వచ్చాయని గుర్తు చేసిన ఐసీఎంఆర్, రెమిడీసివిర్ను రోగులకు ఇవ్వడం వల్ల లివర్, కిడ్నీ వైఫల్యాలు తలెత్తవచ్చని పేర్కొంది.
ఎంతో ఎమర్జెన్సీ అయితేనే రెమిడీసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలను వినియోగించాలని, వీటిని అతిగా వాడటం వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు అధికమని హెచ్చరించింది.
కాగా, కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు రెమిడీసివిర్ సహకరిస్తుందని తేలినప్పటికీ, ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరణాల రేటు మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
