1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:52 IST)

గాయాలలో రక్తం ధారగా పోతుంటే?!

ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.

వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి.
 
ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది.  దీనిని సామాన్య పరిభాషలో 'రణపాల' అని పిలుస్తారు.