ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు ఇక మూడినట్టే. ఈ వైరస్ బారినపడిన అనేక దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ను అంతమొందించేందుకు సరైన మందు లేకపోవడంతో వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పింది. తాము కరోనాను అడ్డుకునేందుకు మోనోక్లోనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని తయారు చేసినట్టు ప్రకటించింది. ఇది శరీరంలోకి వ్యాపించిన...