1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (20:59 IST)

మెంటర్‌గా సేవలందించేందు సిద్ధం.. నయా పైసా వద్దు.. ఎవరు? (video)

అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైర్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా అక్టోబర్ 24న భారత్ - పాక్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని టీ20 వరల్డ్ కప్ 2021 కోసం ఆడే భారత క్రికెట్ జట్టుకు మెంటర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ ధోని భారత జట్టుకు మెంటర్‌‌గా బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు.
 
మొదట ధోనిని సంప్రదించినపుడు భారత జట్టుకు మెంటర్‌గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని అందుకుగాను నయ పైసా కూడా తీసుకోనని, తన సేవని బాధ్యతగానే భావించి ఉచితంగానే పని చేస్తానని ధోని చెప్పినట్లు జై షా తెలిపాడు. రానున్న వరల్డ్ కప్ 2021 అటు కపిల్ దేవ్, విరాట్ కోహ్లి, ధోని సమక్షంలో భారత్ టీ20 ప్రపంచ కప్ ని మరోసారి గెలుస్తుందని జై షా ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ కోహ్లి, ధోని ఇద్దరు 200 కి పైగా టీ20 మ్యాచ్ ల అనుభవం ఉండటంతో మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జట్టుకు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపాడు.