1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (08:49 IST)

ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్.. 12మందికి కరోనా పాజిటివ్

దేశరాజధాని ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ రావడంతో ఒమైక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో.. 12 మంది కోవిడ్‌ లక్షణాలున్న పేషెంట్లు చేరారు. వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. వారిలో 10 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఇద్దరికీ టెస్టులు చేయాల్సి ఉంది. 
 
ఈ పన్నెండు మందిలో ఎనిమిది మంది గురువారం ఆస్పత్రిలో చేరగా.. నలుగురు శుక్రవారం అడ్మిట్ అయ్యారు. కొత్తగా చేరిన నలుగురిలో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్‌ నుంచి, మరొకరు నెదర్లాండ్స్‌ నుంచి వచ్చారు. వీరికి సోకింది ఒమైక్రాన్‌ వేరియంటా కాదా తెలుసుకునేందుకుగాను వారి నమూనాలను జీన్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఫలితాలు ఐదారురోజుల్లో వస్తాయని ఆయన చెప్పారు.