1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (21:05 IST)

అనంత్ అంబానీ-రాధిక ప్రి-వెడ్డింగ్: 3 రోజుల్లో 2,500 వంటకాలు, తిన్న వంటకం రిపీట్ కాకుండా...

Anant Ambani's pre-wedding ceremony begins with food service
అంబానీ కుటుంబం చిన్న కుమారుడు, పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్నదాన సేవతో ప్రారంభమయ్యాయి. జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో, ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌తో సహా అంబానీ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్- శైలా మర్చంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు. దాదాపు 51 వేల మంది స్థానికులకు ఆహారం అందించనున్నారు. ఇది రాబోయే కొద్ది రోజులు పాటు కొనసాగుతుంది.
 
Mukesh Ambani- Anant Ambani
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహానికి ముందు వేడుకల కోసం స్థానిక సమాజం యొక్క ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్న సేవను నిర్వహించింది. భోజనం అనంతరం హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వి తన గానంతో ప్రదర్శనను ఆకట్టుకున్నారు.
 
Anant Ambani serving food
అంబానీ కుటుంబంలో భోజనం వడ్డించే సంప్రదాయం పాతది. అంబానీ కుటుంబం పవిత్రమైన కుటుంబ సందర్భాలలో ఆహారాన్ని అందిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా, అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతూ, అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లను అన్న సేవతో ప్రారంభించారు.
 
Radhika Merchant
అతిథులకు 75 వంటకాలతో అల్పాహారం, 225 కంటే ఎక్కువ పదార్థాలతో మధ్యాహ్న భోజనం, దాదాపు 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 కంటే ఎక్కువ వస్తువులతో అర్ధరాత్రి భోజనం అందించబడుతుంది. అర్ధరాత్రి సమయంలో ప్రారంభమయ్యే అర్ధరాత్రి భోజనం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగుతుంది. విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా ఈ భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వడ్డించే ప్రతి ఒక్క వస్తువు ఖచ్చితమైన మార్గదర్శకాలు, ప్రోటోకాల్ ప్రకారం తయారు చేయబడుతుంది. మూడు రోజుల పాటు వడ్డించే 12 వేర్వేరు భోజనాల కోసం వడ్డించిన వంటకాలు ఏవీ పునరావృతం చేయబడవు. ఈ వంటకాలను సిద్ధం చేసేందుకు 20 మంది మహిళా చెఫ్‌లతో సహా 65 మంది చెఫ్‌ల బృందం ఇండోర్ నుండి జామ్‌నగర్ చేరుకుంది.