శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (13:03 IST)

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తె.. కిరోసిన్ పోసి నిప్పంటించిన..?

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తెకు ఓ తండ్రి కఠినంగా శిక్షించాడు. ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, విరార్ ప్రాంతంలో కూలీపనిచేసే మొహ్మద్ మన్సూర్ అనే వ్యక్తి.. తన భార్య, కుమార్తెతో నివాసముంటున్నాడు. మన్సూర్ కుమార్తె సాయేషా (16) గంటల పాటు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. 
 
ఎంత చెప్పినా సాయేషా ఫోనులో మాట్లాడటాన్ని తగ్గించలేదు. దీంతో ఆవేశానికి గురైన మన్సూర్.. సెల్‌ఫోన్‌ను లాక్కుని.. దాంతోనే సాయేషా తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతికి దొరికిన కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించేశాడు. 
 
ఈ ఘటనను కళ్లారా చూసిన సాయేషా తల్లి.. లబోదిబోమంటూ.. స్థానికుల సాయంతో సాయేషాను ఆస్పత్రికి తరలించింది. తీవ్రగాయాలతో సాయేషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుమార్తెపై హత్యాయత్నానికి ప్రయత్నించడంతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.