1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జులై 2019 (21:02 IST)

జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాది బషీర్ అహ్మద్ అరెస్ట్‌

జమ్మూకశ్మీర్ లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన కరడు కట్టిన ఉగ్రవాది బషీర్ అహ్మద్ ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.బషీర్ అహ్మద్ శ్రీనగర్ లోని రహస్య స్థావరంలో తలదాచుకున్నాడనే సమాచారంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. పోలీసులు బషీర్ అహ్మద్ ఆచూకీ చెప్పినా, హతమార్చిన వారికి రూ.2లక్షలు రివార్డు ఇస్తామని జమ్మూ కశ్మీర్ పోలీసులు గతంలో ప్రకటించారు.