1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (09:44 IST)

కర్నాటకలో ఘోరం - లారీ - బస్సు ఢీ - 9 మంది మృతి

road accident
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందివరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ - ధర్వాడ్‌లో పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
కొల్లపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఒకటి, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులోని నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 23మ మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని క్షతగాత్రులను హుబ్లీ కమిషనర్ పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.