1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (14:53 IST)

కండోమ్ లేదు.. జిగురుతో పాటు వైట్‌నర్‌ రాసుకున్నాడు.. చివరికి?

డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు చేసిన తప్పు.. చివరకు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ప్రేయసితో కలిసి హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న యువకుడు.. ఆ తర్వాత.. సెక్స్ చేయాలని ఆశపడ్డాడు. అయితే.. గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్ ధరించాలని అనుకున్నారు. 
 
అది వారి దగ్గర లేకపోవడంతో పక్కనే ఉన్న ఓ జిగురులాంటి పదార్థాన్ని రాసుకున్నాడు. అనంతరం కలయికలో పాల్గొన్నాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ఫతేవాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(25) అనే యువకుడు తన ప్రేయసి, మరో మహిళతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఒక గది తీసుకున్నారు. అంతకుముందు వారిద్దరూ డ్రగ్స్‌ తీసుకున్నారు. అనంతరం ఆ మత్తు మైకంలో వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో సంరక్షణ మరిచారు.
 
గర్భం రాకుండా ఉండేందుకు ఎలాంటి వస్తువు తెచ్చుకోకపోవడంతో ఆ యువకుడు అక్కడే ఉన్న జిగురుతో పాటు వైట్‌నర్‌ అంటించుకున్నాడు. అనంతరం వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్‌ టవర్‌ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

మృతదేహానికి సోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా ఆ డ్రగ్‌ అతడికి తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. ఇక ఆ జిగురులాంటి పదార్థం కారణంగానే ప్రాణాలు పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.